అమరయ్యకు శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యం,పి.టి.సి. గా  గెలుపొందారు.                            

Botla-amraiahగుంటూరుజిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు యం.పి.టి.సి పదవికి (బి.సి రిజర్వేషను) ది.11.03.2014 న జరిగిన సాధారణ ఎన్నికలలో బొట్ల అమరయ్య తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు.

తన స్వంత అన్న, వై.యస్.ఆర్.సి. పార్టీ అభ్యర్థి  బొట్ల ఆదినారాయణపై 186 ఓట్ల ఆధిక్యతతో యం.పి.టి.సి.  అభ్యర్ధిగా అమరయ్య గెలుపొందారు.

ఆయన ఫిరంగిపురం మండలపరిషత్ కార్యాలయంలో  ది.04.07.2014న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసారు.

అమరయ్య తండ్రి కోట్లింగం, తల్లి సుబ్బమ్మ. వయసు 48 సం.ములు. వృత్తి వ్యవసాయం.

ఈ సందర్బంగా వార్కి www.manaponugupadu.com   తరుపున శుభాకాంక్షలు.

 

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *