Skip to content

మన పొనుగుపాడు

సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి

Menu
  • హోమ్
  • వార్టలు
  • మన గ్రామాలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వికీపీడియా
  • ఆధ్యాత్మికం
  • మన పొనుగుపాడు
    • పొనుగుపాడు గ్రామ చరిత్ర
      • పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
    • జంపని వారసుల చరిత్ర.
      • శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర
      • వంశవృక్షాలు
    • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర. పొనుగుపాడు.
      • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం.
    • శ్రీ రామేశ్వర దేవాలయం చరిత్ర. (చోళేశ్వరాలయం)
    • శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ చరిత్ర.
    • కుటుంబాల చరిత్రలు
    • ముఖ్యుల జీవిత చరిత్రలు
      • గురించి.
        • సంప్రదించండి
Menu

పొనుగుపాడులో జరిగిన వనం-మనం కార్యక్రమ విశేషాలు.

Posted on August 10, 2017August 14, 2017 by Yarra Ramarao

వృక్షో రక్షితి రక్షత:

“మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”.

అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోను ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే ధ్యాస మనందరిలో ఉన్నమాట వాస్తవం.

సరే కాసేపు తప్పులేదు అనుకుందాం.ఆ సంపాదింది ఇచ్చినది అనుభవించుటానికి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి అందించాలనే ఆలోచన గురించి బహు కొద్ది మంది మాత్రం తప్ప ఎవ్వరూ ఆలోచించుట లేదు.

ఇది ఎవరు కాదన్నా అవునన్నా వాస్తవం. మనం జీవించినదే జీవితం కాదు.మన తరువాత మన భావి తరాలవారు ఆరోగ్యంగా జీవిస్తేనే మన జన్మ సార్ధకమైనట్లు.

అలాంటి మంచి ఆలోచనతో మన గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది వేణుగోపాల్ (ఎజిపి) ఆధ్వర్యంలో ది.06.08.2017 ఆదివారం నాడు “వనం-మనం” కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించటం చాలా అభినందించ తగ్గ విషయం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ పాల్గొన్నారు.ముందుగా మేళతాళాలుతో పెద్దలు విద్యార్ధిని, విద్యార్దులు వెంటరాగా “మానవ మనుగడకు వృక్షాలే కీలకం” అనేబ్యానర్లు, ప్లేకార్డులు చేతబూని అతిధులను సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం పాఠశాల ఆవరణలో పసుపు, కుంకమ, పూలుతో అందంగా అలంకరించిన పాదులలో వేదపండితుల మంత్రోచ్చారణల తో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ చే మొక్కలు నాటించారు.

పొనుగుపాడు నుండి గుంటూరు-కర్నూలు వెళ్లు అప్రోచ్ రోడ్డుకు ఇరువైపుల, జిల్లా పరిషత్ ఆవరణలో మరియు మెరికపూడి వెళ్లు మట్టి రోడ్డుకు రెండు వైపుల, నార్నెపాడు వెళ్లు డొంక రోడ్డులో ఇరువైపుల మొక్కలను నాటారు.గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది.

సభా కార్యక్రమం

ఈ కార్యక్రమం సందర్బంగా జిల్లా పరిషత్ ఆవరణలో జరిగిన సమావేశంలో జష్టిష్ సురేష్ కుమార్ కైత్ మాట్లాడుతూ మానవాళికి చెట్లే ప్రాణ దాతలని, సమస్త ప్రాణికోటికి వృక్షం ప్రధానమైనదని చెప్పారు. చెట్టును మనం రక్షిస్తే మనకు అది ప్రాణవాయువు ఇచ్చి మనల్ని రక్షించిదని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతుందని, మానవ జీవితానికి అవసరమైన కలప, అనేక సుగంధ ద్రవ్యంలు అందిస్తున్నాయని చెప్పారు. జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ ఆంగ్లంలోచేసిన ప్రసంగాన్ని జిల్లా జడ్జి హరిహరనాధ శర్మ తెలుగులో అనువదించి చెప్పారు.న్యాయవాది వేణుగోపాల్ మాట్లాడుతూ నాటిన 2500 మొక్కలను గ్రామస్తుల సహకారంతో కాపాడుతామని, ప్రస్తుతం నాటిన మొక్కలు భవిష్యత్తరానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.గ్రామాన్ని నందనవనంగా తీర్చి దిద్దుతామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి హరి హరనాధ శర్మ , రెండవ అదనపు జడ్జి సురేష్, నరసరావుపేట జిల్లా జడ్జి జయకుమార్, జాయంటు కలెక్టరు-2 యం. వెంకటేశ్వరరావు, ఆర్.డి.ఒ. బండ్ల శ్రీనివాస్, జిల్లా ఇన్ చార్జి డి.ఇ.ఒ.పిల్లి రమేష్, నరసరావుపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు పంగులూరి ఆంజనేయులు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి ఉమా మహేశ్వరరావు,మాజీ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వర్లు, డివిజనల్ సామాజిక అటవీ అధికారులు యల్.బీమయ్య, కె.మోహనరావు, తహసీలుదారు పార్ధసారధి, ఎం.పి.డి.ఒ. శ్యామలాదేవి ఇతర ఆధికారులు పాల్గొన్నారు.

గ్రామానికి చెందిన స్థానికులు ముఖ్యులు సర్పంచ్ మాధవరావు, యం.పి.టి.సి.అమరయ్య, వంకాయలపాటి బలరామ కృష్ణయ్య, రాయంకుల శేషతల్పశాయి, గుంటుపల్లి జగన్నాధం, క్రోసూరి సుబ్బారావు, చంద్రమౌళి, తులసీధరరావు, రామాంజనేయులు, హెచ్.యం.పద్మావతి, తదితర గ్రామ పెద్దలు, విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.

సమావేశ అనంతరం జష్టిష్ సురేష్ కుమార్ ఖైత్ ను గ్రామ పెద్దలు అధికారులు సన్మానించారు.

సర్వేజనా:సుఖినోభవంతు

ఫొటో గ్యాలరీ

[smartslider3 slider=42]

Continue Reading

Next Post:
మీగడ రామలింగస్వామి ఆధ్యాత్మిక ప్రసంగం.
Previous Post:
యువతా చెప్పానని కినుక వహించుకమా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Archives

Categories

Recent Posts

  • టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం June 27, 2022
  • పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన పొనుగుపాడు మానస June 3, 2019
  • పొనుగుపాడు ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవ విశేషాలు April 13, 2019
  • ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవం ఆహ్వానం. February 27, 2019
  • ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక January 21, 2019

Recent Comments

  • Maheswara rao Guntakala on సుంకుల రామాంజనేయులు.
  • Venugopal on మన వనం మనమే కాపాడుకుందాం – స్పందించిన దాతలకు కృతజ్ఞతలు.
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
©2022 మన పొనుగుపాడు | Built using WordPress and Responsive Blogily theme by Superb