భాగ్యరేఖ చిత్రం విడుదలకు ముందు పోస్టరు

చరిత్రలో ఈ రోజు 1957 ఫిబ్రవరి 20

నేటికి 67 సంవత్సరాల క్రిందట మనందరి ఇలవేల్పు “శ్రీ వెంకటేశ్వరుడిని నీవుండేదా కొండపై, నాస్వామీ నేనుండేదీ నేలపై”  అని కొలుస్తూ భాగ్యరేఖ చిత్రం విడుదలైన రోజు ఇదే. ఈ పాట తెలుగువారి గుండెల్లో బాగా హత్తుకుపోయిన సంగతి మనందరికీ  తెలుసు. గాయని పి.సుశీల పాడిన ఈ పాట జమునపై చిత్రీకరించారు. వాహినీ సినీ నిర్మాణ సంస్థ అధిపతులలో ఒకరైన బి.ఎన్.రెడ్డి బయట నిర్మాతల కోసం తీసిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో తిరుపతి, తిరుమల కొండలపై చిత్రీకరించిన అనేక దృశ్యాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ చిత్రంలో హీరో ఎన్.టి. రామారావుకు అన్ని పాటలు  ఎ.ఎమ్. రాజా పాడటం ఒక విశేషం.ఈ చిత్రం తరువాత బి.ఎన్. రెడ్డి,  పూజాఫలం చిత్రాన్ని మాత్రమే బయట నిర్మాతల కోసం తీసాడు.

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *